Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
కాంగ్రెస్ MLAల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రుల వారి శాఖలపై ఆరోపణలు వచ్చినా స్పందించలేదని నిలదీశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై MLAలు మౌనంగా ఉండటమేంటని సీఎం ఫైర్ అయ్యారు. అన్నీ తానే మాట్లాడాలంటే అది మంచిది కాదన్నారు.