/rtv/media/media_files/2025/04/25/1XeJ6q2ENVmuJoovJCXa.jpg)
hyd-dgp warning
పాకిస్థానీలను వెంటనే వెనక్కి పంపాలన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే భారత్ ను వీడాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీతో వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు.
Also Read : ఉగ్రదాడికి బిగ్బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
ఏప్రిల్ 27లోగా తెలంగాణలో ఉన్న పాకిస్థానీయులు వెళ్లిపోవాలి
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరమైన చర్యలు తప్పవని పాకిస్థానీయులను హెచ్చరించిన డీజీపీ జితేందర్
ఇప్పటికే ఉన్న అన్ని వీసాలు ఏప్రిల్ 27 నుండి రద్దు చేయబడతాయని.. మెడికల్ వీసాలు మాత్రం ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటు అవుతాయని… https://t.co/xxxgTfULnL pic.twitter.com/5MqxiviBn4
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామన్న డీజీపీ.. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా హైదరాబాద్ లో 208మంది పాకిస్థానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది.
Also Read : బీచ్లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
పాకిస్తానీయులపై పోలీసులు నజర్
హైదరాబాద్లో ఉంటున్న పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్నిరాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు.
Also Read : నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
pakistan