/rtv/media/media_files/2025/04/25/lcuwhszE5ZVYRo54aQmp.jpg)
Pakistanis in Hyderabad: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీస్కు అమిత్ షా ఫోన్ చేసి హైదరాబాద్లో పాకిస్తానీయులపై ఆరా తీశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి భారత్ మీదకు ఉసిగొల్పుతుందని ఆ దేశంలో దౌత్య సంబంధాలు రద్దు చేసింది. ఇండియాలో పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేసి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు పంపింది.
Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'
Home Ministry Identifies Pakistanis In Hyderabad
It’s War nothing less…
— Advocate Neelam Bhargava Ram (@nbramllb) April 25, 2025
Home minister @AmitShah ji called all Chief Ministers & instructed to send back Pakistani nationals.
208 Pakistanis identified by @hydcitypolice #Radicalislamicterrorists pic.twitter.com/3wVI1Av2An
Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్
Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
ఇప్పటికే పాకిస్తానీల వీసాలు రద్దు చేశారు. హైదరాబాద్లో పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు సేకరించారు. 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరి మరో రెండు రోజుల్లోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కేంద్ర ఇచ్చిన గడువు ముగుస్తోండటంతో అన్నిరాష్ట్రాలను కేంద్రహోంశాఖ అలెర్ట్ చేసింది. అదే విధంగా పాక్, ఇండియా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యురీటీ హై అలర్ట్ చేశారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
amith-sha | attack in Pahalgam