/rtv/media/media_files/2025/01/23/c6vfOkZXnJYDmhjLAQpF.jpg)
road rolar Photograph: (road rolar )
Viral News: కొండను తవ్వి ఎలుకను తీశాడనే సామెత సాధారణంగా వింటుంటాం.. అయితే అలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఓ మిస్టర్ దొంగ చేసిన పని చెప్తే అందరూ షాక్ అవుతారు. బైక్, కారు దొంగలించారని తరుచుగా వింటుంటాం. కానీ.. మేధావివర్గానికి చెందని దొంగ ఏకంగా రోడ్డు రోలర్నే దొంగలించాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Read also : గ్రేటర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
గుల్బార్గాకు చెందిన అఫ్రోజ్, ముస్తాఫా కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారు. అఫ్రోజ్, ముస్తాఫాతో పాటు షేక్ అన్వర్ కలిసి బాలానగర్లో నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన రోడ్డురోలర్పై కన్నేశారు. కొన్నిరోజులుగా రోడ్డు రోలర్ అక్కడే ఉండడాన్ని గమనించిన వారు ఎలాగైనా దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేశారు.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
జనవరి 20న రాత్రి రెండు భారీ క్రేన్లను తీసుకొచ్చి రోడ్డు రోలర్ను డీసీఎంలోకి ఎక్కించారు. దాన్ని మహారాష్ట్రలో స్క్రాప్ దుకాణంలో అమ్మేందుకు స్కెచ్ వేశారు. రోడ్డు రోలర్ మిస్ అయిందని యజమాని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రోడ్డు రోలర్ పార్క్ చేసిన ఏరియాలో 64 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ తర్వాత జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోనే రోడ్డు రోలర్ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.
Also Read: బ్యాంకుకు రూ.19 కోట్లు ఎగ్గొట్టిన బీఆర్ఎస్ నేత
ఈ దొంగతనం కేసులో అఫ్రోజ్, మహ్మద్ ఇబ్రహీం, షేక్ అన్వర్, బళ్ల రామ్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సయీద్ ముస్తాఫా పరారీలో ఉన్నారు. గతంలో దూలపల్లి, పేట్బషీరాబాద్ ప్రాంతాల్లో ఓ రోడ్డు రోలర్ను దొంగలించి, మహారాష్ట్రలోని జల్నాలో స్క్రాప్ దుకాణంలో అమ్మేసినట్లు నిందితులు తెలిపారు.