తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. హైదరాబాద్ MMTS ట్రైన్లో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఒక దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతి ట్రైన్ నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అతడిని వెతికే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. చివరికి అతడ్ని గుర్తించారు. ఆ యువతిపై ట్రైన్లో అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి మేడ్చల్కు చెందిన మహేశ్గా గుర్తించారు. అందుకు సంబంధించిన ఫొటోను బాధిత యువతికి చూపించారు. దీంతో-- తనపై అఘాయిత్యానికి పాల్పడింది మహేశ్ అని ఆ యువతి నిర్ధారించింది.
వెంటనే పోలీసులు-- మహేశ్ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కాగా- మహేశ్ బలవంతం చేయడంతో ఆ యువతి ట్రైన్లో నుంచి దూకేసింది. దీంతో-- బాధిత యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను గాంధీ హాస్పిటల్లో చేర్పించగా.. అక్కడ నుంచి ఎంపీ బండి సంజయ్ చొరవతో గాంధీ నుంచి యశోద హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆ బాధిత యువతి- మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏం జరిగింది?
హైదరాబాద్ కొంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకోడానికి యువతి ట్రైన్ బోగీ నుంచి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ దుండగుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకగా తీవ్ర గాయాల పాలైంది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆదివారం రాత్ర సమయంలో జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ఫోన్ మరమ్మతు కోసం ఆదివారం సికింద్రాబాద్కు వెళ్లి తిగిరి ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరింది. మహిళల కోచ్లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు.
Also Read: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి..జట్టును గెలిపించి!
బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు రైలు నుంచి బయటకు దూకింది. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడి గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీపుటేజ్ ఆదారంగా నిందితుడిని కోసం గాలిస్తున్నారు.
(crime-news | latest-telugu-news | telugu-news | Hyderabad MMTS train | MMTS Train Incident | HYD Crime)