TG Crime : హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌...వెలుగులోకి సంచలన పేర్లు

హైదరాబాద్‌ లో మరోసారి భారీ డ్రగ్స్‌ దందా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు భారీగా డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఉప్పల్ లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో నిల్వచేసిన 106 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.

New Update

TG Crime : హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ కంట్రోల్‌ కు ప్రభుత్వ ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న నిందితులు ఏమాత్రం బయపడడం లేదు. కొత్తకొత్త ప్లాన్లతో డ్రగ్స్‌ దందా నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి భారీ డ్రగ్స్‌ దందా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉప్పల్‌లో భారీగా డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి పలు విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ లో నిల్వచేసిన 106 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఉప్పల్ లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో నిందితులు గంజాయిని నిల్వ చేసినట్లు ఖురేషి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళను చంపి.. మృతదేహానికి నిప్పంటించి..!
 
విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో గోదాం మీద దాడి చేశామని ఈ సందర్బంగా ఇద్దరిని అరెస్ట్‌ చేశామని కూడా వివరించారు.ఈ దాడుల్లో 56 ప్యాకెట్‌లలో నిందితులు ప్యాక్ చేసిన106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్కో ప్యాకెట్‌లో రెండు కేజీల చొప్పున 56 ప్యాకెట్లలో  దీన్ని ప్యాక్‌ చేసినట్లు  ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కాగా స్వాధీనం చేసుకున్నగంజాయి విలువ సుమారు రూ.53 లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా సంఘటన స్థలంలో  నిందితులు కట్ల వివేక్ రెడ్డి, మధు కిరణ్‌లు పట్టుబడినట్లు తెలిపారు.  కాగా పట్టుబడ్డ  వివేక్‌రెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.

Also Read: మోస్ట్ డేంజరస్ వీడియోలు.. గజగజ వణుకు పుట్టాల్సిందే!

కాగా పట్టుబడ్డ కట్ల వివేక్ రెడ్డి, మధు కిరణ్‌లను విచారించగా  మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన రాంబాబు నుంచి వీరు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో రాంబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే రాంబాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామన్నారు. మల్కాన్‌ గిరిలోని అటవీ ప్రాంతంలో గంజాయిని పండించి అక్కడే ప్రత్యేకంగా ప్యాక్‌ చేస్తారని తెలిపారు. అలా ప్యాక్‌ చేసిన గంజాయి పలు మార్గాల ద్వారా హైదరాబాద్‌కు చేర్చుతారన్నారు.రాంబాబు మల్కాన్‌గిరి నుంచి నిందితులకు గంజాయి పంపుతున్నాడని,  కట్ల వివేక్‌రెడ్డి, మధు కిరణ్ ఈ గంజాయిని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చేర వేస్తారరన్నారు. కాగా రాంబాబు పంపిన గంజాయి స్టాక్‌ను అవసరమైన చోట్లకు సరఫరా చేసినందుకు గాను ఇద్దరు నిందితులకు రూ.50 వేల చొప్పన ఇస్తాడని ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. కాగా పట్టుబడిన వివేక్‌ రెడ్డిపై రెండు, పరారీలో ఉన్న రాంబాబుపై రెండు కేసులున్నాయని ఖురేషి తెలిపారు.

Also Read :  DGMO చర్చల్లో భారత్, పాక్ డిమాండ్లు ఇవే

Advertisment
Advertisment
తాజా కథనాలు