తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే 14 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే కోస్తాంధ్రాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్కు వేలాడదీసిన భర్త
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీస్తాయని తెలిపింది. మరోవైపు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది మే 24న నైరుతి రుతుపవనాలు కేరళకు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈసారి దాదాపు వారం రోజుల ముందుగానే నైరుతి ప్రవేశించింది.