/rtv/media/media_files/2025/06/05/kKa85BNLSzJEHJmp0xSo.jpg)
Bus Shelter
ప్రస్తుతం రోజుల్లో ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగింది. బయట నుంచి కొని తెచ్చే వస్తువులతో పాటు ఇంట్లో నిల్వ ఉంచుకునే వాటిలో కూడా ప్లాస్టిక్ను వాడుతున్నారు. పట్టణాల నుంచి గ్రామాల వరకు కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు. ఎక్కువగా డ్రింక్లు తాగుతూ వీటిని బయట పడేస్తున్నారు. ఇలా ఉన్న వేస్ట్ బాటిళ్లతో ఓ గ్రామం వినూత్నంగా ఆలోచించింది.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
పర్యావరణ పరిరక్షణ కోసం..
పర్యావరణం పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్లాస్టిక్ బాటిళ్లతో బస్ షెల్టర్ను నిర్మించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించిన ఈ బస్ షెల్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. పరకాల-హుజురాబాద్ ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్న ఈ ఉప్పులపల్లి గ్రామంలో ప్లాస్టిక్ బాటిళ్లు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని ఎంపీడీవో పల్లవి దగ్గరకు గ్రామస్థులు తీసుకెళ్లారు.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
Plastic Bottles Bus Shelter In Uppulapalli Hanamkonda District: ఉప్పులపల్లిలో వినూత్న ఆలోచన#uppulapalli #hanamkonda #warangal #plastic #plasticbottle #busshelter pic.twitter.com/TEB0ZlmGSa
— ABP Desam (@ABPDesam) June 9, 2023
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
ఆమె ఈ ప్లాస్టిక్ను రీసైకిలింగ్ చేయాలని భావించింది. అప్పుడే ప్లాస్టిక్ బాటిళ్లతో బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. గ్రామంలో సేకరించిన చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకుని, వాటితో బస్సు షెల్టర్ నిర్మించారు. దీనిని చూసిన వారందరూ కూడా బాగుందని, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కూడా కలుగుతుందని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Operation Kagar : చత్తీస్ గఢ్ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?