/rtv/media/media_files/2025/01/12/6BJyncq6AY3hKBbezlZA.jpg)
revanth, beer Photograph: (revanth, beer )
Beer Price in TG: తెలంగాణ సర్కార్ మద్యం రేట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బీర్ల ధరలను 15 శాతం పెంచింది. పెరిగిన రేట్లు ఫిబ్రవరి 11 రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో రూ.150 ఉన్న లైట్ బీరు రూ.180 వరకు, రూ.160 ధర ఉన్న స్ట్రాంగ్ బీరు ధర రూ.200 వరకు పెరిగింది. అంటే తెలంగాణలో ఒక్కో లైట్ బీర్పై 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుపై 40 రూపాయలు ధర పెరిగింది. అంతేకాదు.. పాత స్టాక్ఉంటే.. వాటిపై ఎమ్మార్పీ లేబుల్స్ను కూడా మార్చి పెంచిన రేటుకు అమ్మాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒక్క బీర్ల కేస్ మీద 15 శాతం బేసిక్ ధర పెంచితే, దానికి కనీసం రూ. 250 నుంచి రూ. 280 వరకు వ్యాట్, ఎక్సైజ్ ట్యాక్స్ తోపాటు ఇతర పన్నులు యాడ్ అవుతాయి.
Also Read : రోజూ ఆఫీస్కు విమానంలో.. 700 కి.మీ జర్నీ చేస్తున్న ఉద్యోగిణి
బీర్ల ధరలు మాత్రమే పెరిగాయి. రాష్ట్రంలో మద్యం ధరలను ప్రధానంగా బీర్ల ధరలు పెంచాలని లిక్కర్ కంపెనీలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర మద్యం మార్కెట్లో దాదాపు 60 శాతం వాటా ఉన్న మల్టీనేషనల్ బీర్ల కంపెనీ తమకు ప్రస్తుతం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద కనీసం 30.1 శాతం అదనపు ధర చెల్లించాలని కోట్ చేసింది. ఈ కంపెనీ డిమాండ్నే మిగతా కంపెనీలూ అనుసరించాయి. ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ ధరలను15 నుంచి 19 శాతం పెంచేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 15 శాతం బీర్ బేసిక్ ధర పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇలా తెలంగాణలో బీర్ల ధరలు పెరిగాయి.
Also Read: Sri Lanka: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?