రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు ఫలితంగా తెలంగాణ ప్రజలకి బూడిద మిగిలిందని ఎద్దేవా చేశారు. నేడు ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి, గురుదక్షిణగా గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పచెప్పడం కోసమా మీరు గద్దెనెక్కింది అని ప్రశ్నించారు.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
ఇది కూడా చూడండి:పాకిస్థాన్కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
KTR vs Revanth Readdy
జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అని నిలదీశారు. కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో ప్రజలకు ఈరోజుతో తేలిపోయిందన్నారు. తమరి గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా అని ఆరోపించారు. ఇంక రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకని, నిన్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపేయమని మండిపడ్డారు.అప్పుడైనా తెలంగాణా మీద మీకున్న అక్కసు చల్లారుతుందేమో, మీకు జై తెలంగాణా అనాల్సిన బాధ తప్పుతుందేమో అని తీవ్ర విమర్శలు చేశారు.ఒక్క మాట గుర్తు పెట్టుకో…ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు! ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పక పడతాం! కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.
Also Read : తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
AP CM Chandrababu | rahulgandi | ktr vs cm revanthreddy | cm-revanthreddy
KTR : నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి కట్టబెట్టారని ఆరోపించారు.
KTR
రేవంత్ రెడ్డి ముసుగు వీడి, నిజం తేటతెల్లమయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని విమర్శించారు. తెలంగాణ నిధులు రాహుల్ గాంధీకి, తెలంగాణ నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు ఫలితంగా తెలంగాణ ప్రజలకి బూడిద మిగిలిందని ఎద్దేవా చేశారు. నేడు ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి, గురుదక్షిణగా గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పచెప్పడం కోసమా మీరు గద్దెనెక్కింది అని ప్రశ్నించారు.
Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!
ఇది కూడా చూడండి:పాకిస్థాన్కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !
KTR vs Revanth Readdy
జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అని నిలదీశారు. కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో ప్రజలకు ఈరోజుతో తేలిపోయిందన్నారు. తమరి గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా అని ఆరోపించారు. ఇంక రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకని, నిన్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపేయమని మండిపడ్డారు.అప్పుడైనా తెలంగాణా మీద మీకున్న అక్కసు చల్లారుతుందేమో, మీకు జై తెలంగాణా అనాల్సిన బాధ తప్పుతుందేమో అని తీవ్ర విమర్శలు చేశారు.ఒక్క మాట గుర్తు పెట్టుకో…ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు! ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పక పడతాం! కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు.
Also Read : తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య.. చందు నాయక్ హత్య కేసులో సంచలన విషయాలు!
AP CM Chandrababu | rahulgandi | ktr vs cm revanthreddy | cm-revanthreddy