/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mangli-jpg.webp)
Singer Mangli : ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలీయాస్ సత్యవతి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడటం కలకలం రేపింది. ఈ కేసులో పలువురు సెలెబ్రిటీలు పట్టుపడటం సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలెబ్రిటీలకు పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి టాలీవుడ్ కు చెందిన పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో బిగ్బాస్ ఫేం దివి, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, కమెడియన్ రచ్చ రవి, సింగర్ ధనుంజయ్, మంగ్లీ సోదరి సింగర్ ఇంద్రావతి లతో పాటు సుమారు 48 మంది పాల్గొన్నట్లు తెలిసింది.
అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చేవెళ్ల రిసార్టు పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. చాలా మందికి నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. కానీ, ఒకరికి మాత్రం పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారని తెలిసింది.
Also Read : సంచలన అప్డేట్.. ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం !
ఇక అనుమతి లేకుండా విదేశీ మద్యాన్ని వినియోగించి నందుకు కేసు నమోదు చేయడంతో పాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను సీజ్ కూడా చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మంగ్లీతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘవత్, త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు.దామోదర్ రెడ్డి తదితరుల పై కేసు నమోదు చేశారు.
Also Read : మాగంటి గోపీనాథ్ పై దాఖలైన పిటిషన్లు క్లోజ్