కలెక్టర్ పై నోరు పారేసుకున్న కేటీఆర్ | KTR Unusual Comments On Sircilla Collector | RTV
స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం చెందిన దారుణ ఘటన సిరిసిల్లలో చోటు చేసుకుంది. మనోజ్ఞ తలపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. స్కూల్ మెనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యను చంపి.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతోనే భర్త రాజేశం ఈ దారుణానికి పాల్పడట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.
సిరిసిల్ల చేనేతకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుండగా.. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో హరిప్రసాద్ తయారు చేసిన చీర శ్రీ రాముడి పాదాల చెంత ఉంచనున్నారు. ఈ చీరను 26న ప్రధాని మోడీకి అందించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో ఈసారి ఉత్కంఠభరితమైన పోరు సాగనున్నట్లు కనిపిస్తోంది. కేటీఆర్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి రాణి రుద్రమ రెడ్డి బరిలో నిలుస్తున్నారు. వీరిద్దరూ కేటీఆర్ను ఓడించి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.