తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురికి కరోనా.. | Covid 19 Cases In Telugu States | Corona Virus | RTV
సింగపూర్లో ప్రస్తుతం కరోనా కొత్త వేవ్ కలకలం రేపుతోంది. వారం రోజుల్లోనే దాదాపు 26 వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కేపీ.2 వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి కుంగ్ సూచించారు.
అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించేందుకు తాజాగా శాస్త్రవేత్తలు ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేశారు. 'ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ' అనే కొత్త విధానం ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు పేర్కొన్నారు.
జర్మనీలో ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా తీసుకున్నట్లు చెప్పాడు. దీంతో ఓ శాస్త్రవేత్తల బృందం అతడిపై పరిశోధనలు జరిపింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న లాగే అతడి రోగనిరోధక వ్యవస్థలో టీ కణాలు సమర్థమంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.