Corona Tension In AP | ఏపీ లో కొత్త కరోనా కేసులు | New COVID-19 Cases In AP | Special Report | RTV
ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా 48గంటల్లో కరోనాతో తొమ్మిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళలో 1400 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234 కేసులు ఉన్నాయి.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏపీలో నిన్న నాలుగు కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఒకేరోజు 9 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 27కు చేరింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.