కుంటలో రేవంత్ ఇల్లు.. ముందు దాన్ని కూల్చుకో: బాంబు పేల్చిన హరీశ్ రావు!

ప్రభుత్వం మూసీ పరివాహక బాధితులు ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉందని.. ముందు దాన్ని కూలగొట్టాలన్నారు. బలిసినోడికి ఓ న్యాయం, పేదోడికి ఓ న్యాయమా అంటూ విమర్శించారు.

New Update
Hydra Victims

హైదరాబాద్‌లోని హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్లో ఆదివారం బీఆర్‌ఎస్‌ బృందం పర్యటించింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు బండ్లగూడ జాగీర్, హైదర్‌షాకోట్, గంధంగూడ ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించారు. మూసీ ప్రాంత వాసుల ధర్నాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం మీ ఇళ్లు ముట్టుకోకుండా బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. " ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. రేవంత్ ప్రభుత్వం మీ ఇళ్లు ముట్టుకోకుండా మేము అండగా ఉంటాం.  
బుల్‌డోజర్లు వచ్చినా, జేసీబీలు వచ్చినా, ముందు మిమ్మల్ని దాటి రావాలి.

పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే

హైడ్రా పుణ్యామా అని ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీరు అధైర్య పడొద్దు, ప్రాణాలు తీసుకొవద్దు, మీ ఇళ్లకు ఏం కాకుండా మేము అడ్డుపడతాం.1994లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బాధితులందరికీ అనుమతులిచ్చింది. రేవంత్‌రెడ్డి.. మీ తప్పిదాలకు పేదలకు ఎందుకు బలికావాలి ?. ఇందిరమ్మ పాలన అంటే పేదలకు కూడు, గుడ్డ, నీడ ఇచ్చేది. కానీ మీ ఇందిరమ్మ పాలనలో పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం గుర్తు తీసేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి. బాధితులను చూస్తుంటే.. నా కళ్లలో నీళ్లు వస్తున్నాయ్. 

Also Read: సిద్దిపేటలో దారుణం.. మైనర్ బాలికపై యువకుడు అఘాయిత్యం

రేవంత్ ముందు నీ ఇళ్లు కూలగొట్టు

రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లోని సర్వే నెంబర్ 30లో కట్టుకున్న ఇల్లు కుంటలో ఉంది. ముందు దాన్ని కూలగొట్టు. నీ తమ్ముడి ఇల్లు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉంది. నీ ప్రభుత్వ జీవిత కాలం ఐదేళ్లు మాత్రమే. కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు జీవితకాలం నాటి కళ. ముందు నువ్విచ్చిన హామీలు నెరవేర్చు. వృద్ధులకు పింఛన్, రైతులకు రైతుబంధు, మహిళలకు రూ.2500 ఇవ్వు. ఉద్యోగులకు డీఏ ఇవ్వు, దానికి లేని డబ్బులు మూసీ సుందరీకరణకు రూ.లక్షా యభై వేల కోట్లు ఎక్కడికెళ్లి వచ్చాయి ?. రేవంత్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడుతాం. అవసరమైతే ఏరియాకు ఒక ఎమ్మెల్యేను పెట్టి మీ ఇళ్లు కాపాడుతాం. మూసీని ఆక్రమించి ఆరు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతుంటే ఎందుకు కూలగొట్టట్లేదు ?. బలిసినోళ్లకు దగ్గరుండి కట్టిస్తున్నావ్. పేదల ఇళ్లకు మాత్రం నోటీసులిస్తావా ?. పేదలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అండగా ఉంటారు, మీరంతా ధైర్యంగా ఉండండి. 

1908లో వరదలొచ్చిన నిజాం రాజు ఇళ్లు కూలగొట్టలేదు. కానీ రేవంత్.. నిజాం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాడు. బలిసినోళ్లకు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా ?. బాధితులకు ఇబ్బంది వస్తే, తెలంగాణ భవన్‌కు రండి. 24 గంటలు తలుపులు తెరిచే ఉంటాయ్. అర్ధరాత్రి వచ్చినా, మీకు ఆశ్రయమిస్తాం.
అత్యవసరమైతే ఫోన్ చేయండి. పదిహేను నిమిషాల్లో మీ ముందుంటాం. రేవంత్‌రెడ్డి బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వు. మౌనం వీడి, మూసీ సుందరీకరణ మానుకో. స్కూళ్లలో, హాస్టల్స్‌లో టాయిలెట్స్ లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. నీ దగ్గర పైసలు ఎక్కువుంటే ముందు వాటిని నిర్మించండి. గాంధీ ఆస్పత్రిలో గోలిలు లేవు, మందులు లేవు. ముందు అవి కొని, పేదలకు మెరుగైన వైద్యం అందించూ. రేవంత్.. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకోకు. మొద్దు నిద్ర పోతున్న రేవంత్‌ను తట్టి లేపేందుకే మేమంతా మీ ముందుకొచ్చాం. ఆపదొస్తే ఫోన్ చేయండి. అర్ధగంటలో మీ ముందుంటానని'' హరీశ్ రావు అన్నారు. 

Also Read: రాజాసింగ్ హత్యకు కుట్ర.. హైదరాబాద్ లో కలకలం!

Advertisment
Advertisment
తాజా కథనాలు