SLBC Tunnel: టన్నెల్ వద్ద సీఎం రేవంత్.. అధికారులకు కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా రేవంత్ రెడ్డితో ఉన్నారు.

New Update
CM Revanth Reddy Tunnel

CM Revanth Reddy Tunnel Photograph: (CM Revanth Reddy Tunnel)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన ముగించుకుని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వద్దకు చేరుకున్నారు. జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా టన్నెల్ వద్దకు వెళ్లారు. 

ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !

ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!

జీపీఆర్ మార్కింగ్ చేసి..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. వరుసగా తొమ్మిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్‌ను వద్దకు వెళ్లారు. అయితే టన్నెల్‌లో ఉన్నవారంతా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. టన్నెల్‌ లోపల జీపీఆర్‌ మార్కింగ్‌ చేసి నాలుగు మృత దేహాలను గుర్తించారు. వాటిని తీసి సొంత గ్రామాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన నాలుగు మృత దేహాలు తీయడం కష్టమని ఎన్టీఆర్ బృందాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Sandeep Reddy Vanga: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..

Advertisment
Advertisment
తాజా కథనాలు