TG News: 'తెలంగాణకు కృష్ణా నీటిలో 70% వాటా?'

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదించాలని సూచించారు. కృష్ణా బేసిన్‌లో 70% తెలంగాణలో, 30% మాత్రమే ఏపీలో ఉందన్నారు. 

New Update
CM Revanth

CM Revanth key advice to irrigation department on Krishna water

TG News: కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి 70% వాటా వచ్చేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. తదనుగుణంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (KWDT) ముందు వాదించాలని సూచించారు. మొత్తం కృష్ణా బేసిన్‌లో 70% తెలంగాణలో ఉందని, కేవలం 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడటానికి ముందు ప్రారంభించిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు తెలంగాణకు కేటాయింపులు జరగాలని చెప్పారు. 

Also Read :  వివో ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త ఫోన్ లాంచ్.. ఇయర్‌బడ్స్ ఫ్రీ - ఆఫర్లు అదుర్స్!

రాబోయే 18 నెలల్లో పూర్తి..

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై బుధవారం నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, నీటిపారుదల అధికారులతో  ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టిసీమ ద్వారా ఏపీ గోదావరి నీటిని తీసుకుంటున్నందున, పట్టిసీమ పైన ఉన్న 90 TMCFT నీటిని వినియోగించుకునే ప్రతిపాదనలను మన నీటిపారుదల శాఖ తీసుకురావాలన్నారు. కృష్ణాపై ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను జూన్ 2027 నాటికి ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని, ముఖ్యంగా పాలమూరు-రంగా రెడ్డి ఉద్దండాపూర్ వరకు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. రాబోయే 18 నెలల్లో అన్ని పనులు, జూన్ 2026 నాటికి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read: ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్థాన్ వ్యాపారం.. అసలేం జరుగుతోంది?

ఇక తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను మొదట వేగంగా చేపట్టాలన్నారు. కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తి అయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన 244 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందించారు. 

Also Read :  మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అక్రమాలు.. YS రెడ్డిపై ఈడీ రైడ్స్!

Also Read :  దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన

today telugu news | telugu-news | krishna-water | cm revanth

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు