/rtv/media/media_files/2025/09/25/kaleshwaram-2025-09-25-11-05-47.jpg)
Kaleshwaram
KALESWARAM : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ అనుమతితో శాసనసభ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపడానికి సీబీఐ ముందుకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణను సీబీఐఅధికారులు ఇవాళ( గురువారం) ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం కోరిన దర్యాప్తు నేపథ్యంలో సీబీఐ అధికారులు ప్రాథమిక పరిశీలన ప్రారంభించారు.అందులో భాగంగా NDSA, జస్టిస్ PC ఘోష్ నివేదికలను CBI అధికారులు పరిశీలించారు. కాగా రికార్డులను పరిశీలించిన అనంతరం FIR నమోదు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాజెక్టులో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపేందుకు సీబీఐ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చేసిన విజ్ఞప్తి మేరకు CBI విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
సీబీఐ విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ను సీబీఐ అధికారులు విచారించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.