K. T. Rama Rao : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది...కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుపాను వేగంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని తెలిపారు. .

New Update
KTR

KTR

K. T. Rama Rao :తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుపాను వేగంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, చేవెళ్లకు త్వరలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని తెలిపారు. ఎన్టీఆర్ - టీడీపీ తర్వాత.. ఇరవై ఐదేళ్ల పాటు పార్టీని నడిపింది కేసీఆర్ మాత్రమేనని ఉద్ఘాటించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని కేసీఆర్ పార్టీ పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేసిఆర్ తెలంగాణ కోసం కష్ట పడి 2001 లో డిల్లీ నీ సైతం వణికించి తెలంగాణ సాధించారన్నారు.  ఒంటరిగా తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు.

Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!

కులబలం, ధనబలం లేకుండా కేసీఆర్ పార్టీని స్థాపించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు హైదరాబాద్ నగరంలో గతంలో స్థలం ఇవ్వలేదని గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే నాటి ప్రభుత్వం ఆఫీసును ఖాళీ చేయించిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ సూపర్ హిట్ అయిందని ఉద్ఘాటించారు. హైదరాబాద్ బయట కాంగ్రెస్ చేతిలో ప్రజలు మోసపోయారని అన్నారు. రేవంత్ రెడ్డి.. తన అన్న ఇల్లును ఎందుకు కూలగొట్టరని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చారని అన్నారు. 17నెలల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలయిందని అన్నారు. పథకాలకు పైసలు లేవని.. లక్షన్నర కోట్లు పెట్టి మూసీ కడతానని రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.

Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్‌..!

 హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ,సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి అరాచకాలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసును ప్రస్తావిస్తూ.. ఒక్క జింకను చంపిన సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెడితే.. మరి నాలుగు జింకలను చంపిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. సందట్లో సడేమియాలా బీజేపీ నేతలు అధికారం కోసం ఆశపడుతున్నారని చెప్పారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పులపై ఒక్క మాట కూడా మాట్లాడరని మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.ఇద్దరు కేంద్రమంత్రులతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

ఇద్దరు కేంద్రమంత్రులతో తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 17నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక్క పైసా పని లేదని మండిపడ్డారు. పేరు చెప్పకుండా తాను ఒక బీజేపీ ఎంపీని అంటే గుమ్మడి కాయల దొంగల్లాగా అందరూ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను నమ్మి మొన్ననే మోసపోయాం.. ఈసారి బీజేపీని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ పెడితే రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డిలది దృఢమైన బంధమని ఆరోపించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో మోదీ ఎందుకు విచారణ చేయించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. పొంగులేటి ఇంటిమీద ఈడీ రైడ్ జరిగితే దానిమీదా ఏవరూ మాట్లడరని, Hcu అంశం, ఆర్ ఆర్ టాక్స్ తెలంగాణ నడుస్తోంది అని నేను చెప్తే సిబిఐ, ఈడి నీ పంపాలని అడిగితే ప్రధాని సప్పుడు లేదన్నారు. 

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు