KCR: ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?

త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్రపతితో బీఆర్ఎస్ బీసీ నేతల బృందంతో కలిసి సమావేశం కావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ధర్నా తర్వాత కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉండే ఛాన్స్ ఉంది.

New Update
KCR Delhi Tour

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీసీ నాయకులతో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆవశ్యకతను వివరించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోసం BRS నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 6న బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ధర్నా చేపట్టనుంది. ఆ తర్వాత కేసీఆర్ కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read :  ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్

ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీలకు 42% కోటా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రజల్లో చైతన్యమే లక్ష్యంగా మరో ఉద్యమం చేపడతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో బీసీ నేతలు వరుసగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 8న కరీంనగర్ వేదికగా శంఖారావం పూరించనున్నట్లు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగాలని భావించడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

Also Read :  రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!

ఢిల్లీకి రేవంత్ టూర్..

అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని పట్టుదలతో ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం సహకరించడం లేదని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో హస్తం నేతలు భారీ ధర్నా తలపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆగస్టు 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులను సీఎం బృదం కలవనుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలనే కాకుండా ఇండియా కూటమి మద్దతును కూడా కోరాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ కూటమి అగ్ర నేతలను కలిసి కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై వివరిస్తారు. తాము తీసుకువచ్చిన బీసీ బిల్లకు మద్దతు కోరనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 6న భారీ ధర్నా చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాలు మొత్తం బీసీ బిల్లు చుట్టే తిరుగుతున్నాయి. 

telugu-news | telugu breaking news | latest-telugu-news | latest telangana news

Advertisment
తాజా కథనాలు