/rtv/media/media_files/2025/04/28/Opiv6VYXmxUyFi1L2TrP.jpg)
BRS MLC Kavitha support Maoist party
Kavitha: బీఆర్ఎస్ నేతలు మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తున్నారు. కేసీఆర్కు వాఖ్యలకు సపోర్టుగా ఎమ్మెల్సీ కవిత ఆపరేషన్ కగార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను అంతం చేస్తామనే కేంద్ర ప్రభుత్వం విధానం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలని కోరారు.
#WATCH | Hyderabad, Telangana: BRS president K Chandrasekhar Rao urged the Centre to have a dialogue with the Naxals and stop Operation Kagar
— ANI (@ANI) April 28, 2025
BRS MLC Kavitha says, "...Operation Kagar is being carried out in Chhattisgarh and our party and we firmly believe that the ideology of… pic.twitter.com/jbNb2YWUHR
ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేండి..
ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన కవిత.. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరారు. మావోయిస్ట ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలని అన్నారు. 'పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3500 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు. కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఛత్తీస్ ఘడ్ నుంచి వచ్చి కూడా తెలంగాణలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. కేసీఆర్ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఎవరు చనిపోయినా కూడా మన దేశ పౌరులే కాబట్టి కేంద్రం చొరవ తీసుకోవాలి' అని చెప్పారు.
Also Read: Hyderabad Metro:తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్అండ్టీ
ఇదిలా ఉంటే.. ఆదివారం ఎల్కతుర్తి రజతోత్సవ సభలో కేసీఆర్ సైతం నక్సలైట్లను చంపొద్దని కోరారు. ఛత్తీస్గఢ్లో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అక్కడున్న గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు కోరుతున్నారని, వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపుతామని కేసీఆర్ చెప్పారు.
Also Read: Pak-India: పాక్కు చావు దెబ్బ.. ఔషధాల కొరతతో హెల్త్ ఎమర్జెన్సీ!
maoist | telugu-news | today telugu news