/rtv/media/media_files/2025/09/29/btkamma-2025-09-29-07-49-35.jpg)
Bathukamma:గిన్నిస్ రికార్డుల్లో(Guinness World Records) స్థానం దక్కించుకునేందుకు బతుకమ్మ(Bathukamma 2025) సిద్ధమైంది. ఒకేసారి 10 వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డు చోటు సంపాదించడమే లక్ష్యంగా తెలంగాణ(Telangana) ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సోమవారం సరూర్నగర్ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా 66.5 అడుగుల ఎత్తయిన బతుకమ్మను సిద్ధం చేశారు. పర్యాటకశాఖ ఎండీ వల్లూరి క్రాంతి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజ, ఇతర ఉన్నతాధికారులు ఇండోర్ స్టేడియంలో శిక్షణ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించి తగిన ఏర్పాట్లు చేశారు. ఇక ఒకేసారి 10 వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటించనున్నారు.
An anthem celebrating Telangana pride, the dignity of women & our beloved Bathukamma festival.#ManaBathukammaCarnival#Bathukamma2025#TelanganaCulture#WomensDignityTelanganasPride#ManaTelangana#bathukamma2025 #prideoftelangana #manabathukamma #telanganakeerthikeeritampic.twitter.com/5e3eAqkJg5
— Telangana Tourism (@TravelTelangana) September 22, 2025
ఇది కూడా చూడండి: Asia Cup 2025: మా కొద్దు మీరే ఉంచుకోండి..ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా
ప్రముఖుల హాజరు..
ఇక సోమవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఈ ప్రదర్శన జరగనుండగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజా, టూరిజం ఎండీ క్రాంతి, పలువురు అధికారులు స్టేడి యానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో సందడి చేయనున్నారు. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ దారి మళ్లిస్తున్నారు.
Women bikers from the Bikerni group and cyclists participated in the Bathukamma Rally#Bathukamma2025#ManaBathukammaCarnival#TelanganaPride#CelebratingWomanhood#WomensDignityTelanganasPride#ManaTelangana#PrideOfTelangana#ManaBathukamma#TelanganaKeerthiKeeritampic.twitter.com/QX8sWW8sDi
— Telangana Tourism (@TravelTelangana) September 28, 2025
ఇది కూడా చూడండి: Team India: రోహిత్ ను ఫాలో అయిన కెప్టెన్ స్కై..సెలబ్రేషన్స్ మూమెంట్ చూశారా..
మహిళల సైకిల్ ర్యాలీ
ఇదిలా ఉంటే.. ఈ బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మహిళలు బైక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి జూపల్లి జెండా ఊపి ఈ ర్యాలినీ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా సైక్లి్స్టలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన విమెన్ బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్ బైకులతో నిర్వహించిన ర్యాలీ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.