Asia Cup 2025: మా కొద్దు మీరే ఉంచుకోండి..ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమ్ ఇండియా. భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. . కానీ కప్ మాత్రం మాకు వద్దు అన్నారు. వాళ్ళు ఇస్తే తీసుకోమని నిరాకరించారు. ఎందుకో తెలుసా..

author-image
By Manogna Alamuru
New Update
asia cup

41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ లో తలపడ్డ ఇరుజట్లలో టీమ్ ఇండియా దే పైచేయి.  ఫైనల్ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించాడు.  మరుపురాని విజయాన్ని సాధించిన తర్వాత భారత్ జట్టు మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.  తన తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ ను తీసుకోవడానికి నిరాకరించింది. పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడమే దీనికి కారణం. వాళ్ళకు షేక్ ఇవ్వడానికే తాము ఒప్పుకోలేదని దీనికి ఎలా ఒప్పుకుంటామంటూ ట్రోఫీ , మెడల్స్ తీసుకోకుండానే టీమ్ ఇండియా ఆటగాళ్ళు డగౌట్ కు చేరుకున్నారు. 

వాడెవ్వడు మాకు ట్రోఫీ ఇవ్వడానికి...

పాకిస్తాన్ మంత్రి నఖ్వీ చాలా సేపు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ భారత ఆటగాళ్ళు మాత్రం పోడియం మీదకు రాలేదు. ఫోన్లు చూస్తూ కిందనే కాలక్షేపం చేశారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. చివరకు నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత టీమ్ ఇండియా ఆటగాళ్ళు  పోడియం దగ్గరకు వచ్చి సంబరాలు చేసుకున్నారు.  భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. 

మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ..తమ విజయంతో దేశం మొత్తం సంబరాలఉ చేసుకుంటుందని అన్నాడు. మ్యాచ్ తరువాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ పాల్గొన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  అందులో ట్రోఫీని తీసుకోకపోవడంపై సమాధానం ఇస్తూ..తన కెరీర్ లో ఒక విజేత జట్టు ట్రోఫీని నిరాకరించడం ఇదే మొదటి సారని స్కై అన్నాడు.  తాము అన్ని రకాలుగా అర్హులే అయినప్పటికీ...కావాలనే తిరస్కరించామని చెప్పాడు.  మిగతా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా దాటవేశాడు. 

Advertisment
తాజా కథనాలు