/rtv/media/media_files/2025/02/19/Xt35Ph2wHV5cMvHps2Ez.jpg)
crime Photograph: (crime)
TG Crime : నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అక్కడున్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందిపేట మండల పరిధిలోని చిమ్రాజుపల్లి గ్రామ శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సదరు మహిళ షాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలతగా గుర్తించారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న నందిపేట పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇది కూడా చూడండి: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ఘటన ప్రాంతాన్ని బట్టి చూస్తే దుండగులు సదరు మహిళపై పలుమార్లు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా ఘటనా స్థలంలో మృతదేహం పక్కన మద్యం గ్లాసులతో పాటు సిగరేట్ పీకలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు తెలిసినవారే కావాలని తీసుకొచ్చి మద్యం తాగించి అత్యాచారం చేశారా? లేక మద్యం మత్తులో లైంగికదాడి చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్