/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t115614323-2025-11-07-11-56-51.jpg)
Another RTC bus accident
RTC Bus Accident: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు (Bus Accidents) వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు, ప్రవేటు బస్సు ఏదో ఒకటి బస్సు ప్రమాదానికి గురి కావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి.
రోజుకో చోట ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ప్రాంతంలో బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
మరో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 7, 2025
హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఘటన
సిగ్నల్ వద్ద ఆర్టీసీ బస్సు ఆగి ఉండగా.. వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన డీసీఎం
ఢీకొట్టగానే తమ సీట్ల నుంచి కింద పడ్డ ప్రయాణికులు.. పలువురికి గాయాలు
గాయపడ్డ వారిని ఆస్పత్రికి… pic.twitter.com/TgKQ6CJIOK
వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా డీసీఎం ఢీకొట్టడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సును డీసీఎం ఢీకొట్టిన వెంటనే భారీ శబ్ధం రావడంతో రోడ్డుపై వెళ్తున్నవారు ఉలక్కిపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు.
కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సహయ చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా వచ్చి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: కిచెన్లో ఈ రెండు కలిపి నిల్వ చేస్తున్నారా..? నాణ్యత, రుచి దొబ్బింది ఎలానో తెలుసుకోండి!!
Follow Us