/rtv/media/media_files/2025/06/07/FEzoBIh0bPn5Adk9LKA0.jpeg)
telangana cabinet
కేబినెట్ విస్తరణలో సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చేటు దక్కుతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ సామాజిక వర్గాల వారిగా మంత్రి పదవులు కేటాంపు చేసింది. ఆరు స్థానాలు ఖాళీ ఉండటంతో మరో ముగ్గురికి అవకాశం కల్పించారు. ఇప్పటికే కేబినెట్లో నలుగురు రెడ్లు ఉన్నారని.. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వలేదు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజ్ గోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి ల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ లిస్ట్లో వారి పేర్లు లేవు. అలాగే ఎమ్మెల్సీలుగా ఉన్న విజయశాంతి, అద్దంకి దయాకర్ లు కూడా మంత్రివర్గంలో కి వెళ్తారని ప్రచారం జరిగింది.
నూతన మంత్రులుగా
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2025
బాధ్యతలు స్వీకరించబోతున్న
శ్రీ వివేక్ వెంకట స్వామి గారు,
శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు,
శ్రీ వాకిటి శ్రీహరి గారి కి
నా అభినందనలు.
శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్ గారి కి
నా అభినందనలు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని కూడా మంత్రి పదవి వరిస్తుందని అనుకున్నారు. అదే జిల్లా నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకట స్వామి పేరు లిస్ట్లో ఉంది. ఉమ్మడి కరీం నగర్ నుంచి మాదిగ కమ్యూనిటీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం ఇచ్చారు. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్మే వాకిటి శ్రీహరికి కేబినెట్లో చోటు దక్కింది. ఎస్టీలకు మాత్రం ఇప్పటి వరకూ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కంటితుడుపు చర్యగా రామ్ చంద్రు నాయక్కు డిప్యూటీ స్పీకర్గా పదవి ఇచ్చారు. మరో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీరందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు కాగా ఆయా సామాజికవర్గంలోనూ, జిల్లాలోనూ వీరికంటే సీనియర్లు లేకపోవడం కలిసివచ్చింది.
telangana | cabinate | telangana cabinet ministers | telangana-cabinet-expansion | raj-bhavan | gaddam vivek venkataswamy | adluri-lakshman | laxman-kumar-adluri | latest-telugu-news