తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly meeting ) ఆగస్టు 3 నుంచి జరగనున్నాయి.అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ కీలక సమావేశాలు కానున్నాయి. దీంతో నేతల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వరదలే అస్త్రం కానున్నాయి. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది. ఇకముందు ఏం చేయబోతోందన్న దానిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకాలను (Schemes) కూడా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈనెల 31న కేబినేట్ భేటీ కానుంది. ఇక గతంలో బీఆర్ఎస్ రెండు బిల్లులను గవర్నర్ రిజెక్ట్ చేసిన సవరణ బిల్లు కూడా అందులో మెయిన్గా (Main) ఉండబోతోంది.
పూర్తిగా చదవండి..ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు.
Translate this News: