లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ అధికారుల బదిలీ కొనసాగుతోంది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారుల్ని బదిలీ చేశారు. జడ్పీ సీఈవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వాళ్లతో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Telangana: పంచాయతీరాజ్శాఖలో భారీగా బదిలీలు.. ఎందుకంటే
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు.. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ శాఖలో పనిచేస్తున్న 105 మంది అధికారుల్ని బదిలీ చేసింది.
Translate this News: