Wanaparthy District: చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు.. వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే!?
చనిపోయాడనుకున్న వ్యక్తి ..లేచి కూర్చున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అభిమాని తైలం రమేష్ అనే వ్యక్తి మరణించాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరినిమిషంలో ఆయన శరీరంలో కదలికలు చూసి ఆసుపత్రికి తరలించగా బతికాడు.