దువ్వాడ నెక్స్ట్ స్టెప్.. | Duvavda Srinivas Suspension From YCP | Duvvada Next Step | YS Jagan |RTV
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ చంద్రబాబు నాయుడుని కలిసి కాళ్లపై పడ్డారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చేర్పించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తనపై చేసిన కామెంట్స్ పై మాజీ రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి స్పందిచారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదన్నారు.
ఏపీలో ప్రభుత్వం పోయాక వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అయితే ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మాత్రం అధికార పార్టీలను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.