TGPSC: గ్రూప్-1 మూల్యాంకనంపై ఆరోపణలు.. TGPSC కీలక ప్రకటన!
గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను టీజీపీఎస్సీ కొట్టివేసింది. మార్కులను కేటాయించడంలో పారదర్శకంగా వ్యవహరించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే అభ్యర్థులు, ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది.