UPI సేవలు బంద్.. UPI సేవలు బంద్.. స్టేట్ బ్యాంక్ షాకింగ్ ప్రకటన!
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ రోజు మద్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ డిజిటల్ సేవలు బంద్ అవుతాయని తెలిపింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ రోజు మద్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ డిజిటల్ సేవలు బంద్ అవుతాయని తెలిపింది.
కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్ మూసివేశారు. కేటీఆర్, హరీష్, మహేశ్వరరెడ్డి తదిరత నేతలను యూనివర్సిటీకి వెళ్లకుండా అరెస్ట్ చేశారు.
పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో టీ తాగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రవీణ్ చాలా నీరసంగా కనిపించినట్లు ఆ హోటల్ లో పని చేసే వ్యక్తి RTVకి చెప్పారు. ఈ సమయంలో అంత దూరం ప్రయాణించవద్దని తాను చెప్పానన్నారు.
పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని మాజీ ఎంపీ హర్షకుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుకాల ప్రభుత్వమే ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ హత్యపై ఎందుకు హైరానా పడుతోందని ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శ్రీనివాస్ పై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. మరో వైపు రమేష్ రెడ్డిని 48 గంటల్లో పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన విధించిన గడువు నేటితో ముగియనుంది. దీంతో టీడీపీ హైకమాండ్ నెక్ట్స్ స్టెప్ ఏంటనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవన్ ను టార్గెట్ చేసే ఆయన ఈ వీడియో షేర్ చేశారన్న చర్చ సాగుతోంది.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను అందించాలని పేర్కొన్నారు. ప్రవీణ్ ది హత్యే అని హర్ష కుమార్ ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసును ఛేదించేందుకు దాదాపు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 2, విజయవాడ-రాజమండ్రి మార్గంలో మరో 2 టీమ్స్ వివరాలను సేకరిస్తున్నాయి. మరో టీం ప్రవీణ్ ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది.