/rtv/media/media_files/2025/03/15/c6XH10Zi63wdbTSV844k.jpg)
Mallu Bhatti Vikramarka
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ ఆందోళనల సందర్భంగా స్టూడెంట్స్ పై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు. సంయమనం పాటించాలని, విద్యార్థులపై దుందుడుకుగా వెళ్లవద్దని పోలీసులకు సూచించారు. ఈ రోజు ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బిల్లి రావుకు 400 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు.
అభివృద్ధి కోసమే ఆ భూములను వినియోగిస్తాం..
అనంతరం 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులను రద్దు చేశామన్నారు. తమ న్యాయపోరాటంతో తెలంగాణ ప్రభుత్వానికి ఆ భూములు దక్కాయన్నారు. అభివృద్ధి కోసమే ఆ భూములను వినియోగిస్తామని స్పస్టం చేశారు. హైటెక్ సిటీని విస్తరిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారు ఇతరులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
(hcu | telugu-news | latest-telugu-news | telugu breaking news)