🔴Live Breakings: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ఆరోగ్య శ్రీ రూల్స్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇది వరకు మూడేళ్ల వయస్సు ఉండగా ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్ వెల్లడించారు.
వరంగల్లో ఓ కిలాడీ లేడీ అరాచకాలు బయటపడ్డాయి. పాఠశాలకు వెళ్లే బాలికలను టార్గెట్ చేస్తూ వారిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయిస్తుంది. తాజాగా ఓ బాలిక మిస్సింగ్ కేసుతో ఈ భయంకరమైన ఘోరాలు బయటపడ్డాయి
విశాఖపట్నం To లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ రూటు మారింది. ఏప్రిల్ 25 నుంచి ఈ ట్రైన్ సికింద్రాబాద్లో ఆగదు. ఇక నుంచి లింగంపల్లి నుంచి చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నాగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సభ మన అందరిది, సభ మీ ఒక్కరిది కాదంటూ ఈ రోజు జగదీష్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. హన్మకొండకు చెందిన తేజస్విని 532.5 మార్కులు, హైదరాబాద్కు చెందిన శివరాజ్ పబ్బా 506, చందన 503.5 మార్కులు సాధించారు. రీకౌంటిగ్ ప్రక్రియ పూర్తయ్యాకే జనరల్ ర్యాకింగ్ లిస్టు వెల్లడించనున్నారు.
శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్ హెడ్ ఆఫీస్లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్డిస్క్లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై ఆరాతీస్తున్నారు.
వరుసగా 15వరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు సింగరేణి నుంచి అదనపు కార్మికులను పిలిపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్ రివ్యూ నిర్వహించారు. అలాగే మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ళపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. మరో వారం రోజుల్లో ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి..పనులు మొదలుపెడతామని తెలిపారు.