రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తంగళ్ళపల్లి మండలం దేసయ్పల్లెకి చెందిన వంశీ ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి లక్షలు కోల్పోయాడు. 20ఏళ్ల వంశీ ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు చేసిన డబ్బులు కోల్పోయానన్న మనస్థాపంతో మంగళవారం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంటర్ పూర్తి చేసి మెకానిక్గా
వంశీ ఇంటర్ పూర్తి చేసి మెకానిక్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్స్కు బానిస అయ్యాడు. బంధువులు, స్నేహితుల వద్ద భారీగా అప్పులు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వకుంటే వారి వేధిస్తారని తల్లిదండ్రులు మందలించడంతో వంశీ ఆత్మహత్య చేసుకున్నాడు.