రోడ్డెక్కిన..పోలీస్ భార్యలు! | Constable Wifes Dharna In Nijamabad | RTV
కూతురును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న అల్లుడిని చంపేందుకు వెళ్లిన వ్యక్తి అడ్డొచ్చిన వియ్యంకుడిని పట్టపగలే నరికి చంపిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కూతరు భవిత అల్లుడు గోవర్ధన్ కారణంగానే చనిపోయిందని కోపంతో రగిలిపోయిన సత్యనారాయణ వియ్యంకుడు నరహరిని హతమార్చాడు.
నిజామాబాద్ జిల్లా దేశాయిపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేక్ క్యాచర్ మోచి శివరాజు అనే 18 ఏళ్ల యువకుడు పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని శివరాజు ఫొటోకు ఫోజులిచ్చాడు. అదికాస్తా కాటు వేయగా మృతి చెందాడు.
నిజామాబాద్లో మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో, అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సెల్ఫోన్లో తన బాధను వాయిస్ రికార్డు చేశారు.
తాను చేసిన తప్పును భర్త క్షమించినప్పటికీ బంధువులు మాటలతో హింసించి, దుష్ప్రచారం చేస్తున్నారనినిజామాబాద్ లో ఓ యువజంట రైలు పట్టాల పై పడి ఆత్మహత్య కు పాల్పడింది.. దీని గురించి ఆ జంట సెల్ఫీ వీడియో ద్వారా కోటగిరి ఎస్సై కి తెలియజేశారు.
నిజామాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్లూర్ మండలం దాస్నగర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయలయ్యాయి.
మద్యం సేవించి తమను హింసిస్తున్నాడనే కోపంతో ఓ భార్య మామాతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా తిర్మలాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాములు మృతదేహాన్ని రెండు రోజులు ఇంట్లోని సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టి తర్వాత గుంత తవ్వి పూడ్చిపెట్టడంతో ఘోరం బయటపడింది.