దృశ్యం సినిమాను మించిన మ*ర్డర్ | Kanpur Murder Case | Gym Trainer | UP Police | RTV
కూతురును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న అల్లుడిని చంపేందుకు వెళ్లిన వ్యక్తి అడ్డొచ్చిన వియ్యంకుడిని పట్టపగలే నరికి చంపిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కూతరు భవిత అల్లుడు గోవర్ధన్ కారణంగానే చనిపోయిందని కోపంతో రగిలిపోయిన సత్యనారాయణ వియ్యంకుడు నరహరిని హతమార్చాడు.
కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ యువకుడు తన తల్లిని గొంతుకోసి చంపిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరులో చోటుచేసుకుంది. తల్లి సాయమ్మను కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హతమార్చాడు శివ. ఆ తర్వాత తాను అదే కత్తితో పొడుచుకుని చనిపోయాడు.
ఏపీ ఆత్మకూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వాహీద్ మర్డర్ కేసు మిస్టరీ కొనసాగుతూనే ఉంది. లవ్ ఇష్యూలో బాలిక పేరెంట్స్ కిడ్నాప్ చేయించి చంపించారని వాహీద్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తమకు సంబంధం లేదని బాలిక కుటుంబం చెబుతోంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఓ కిరాణ షాపు యజమాని అబుసయ్యద్ మరణానికి హసీనానే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హసీనాతోపాటు మరో 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు కథనాలు వెలువడ్డాయి.
ఫ్యాన్ రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్ట్ చేసిన కన్నడ హీరో దర్శన్కు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. రేపు ఆదివారం కావడంతో దర్శ్ను పోలీసులు ఒకరోజు ముందుగానే కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తొమ్మిది రోజులు అడిగారు కానీ కోర్టు ఐదు రోజులకే పర్మిషన్ ఇచ్చింది.
కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. రేణుక స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ మర్డర్ కేసు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట లభించింది. డేరా బాబాతో పాటు మరో నలుగురిని పంజాబ్-హర్యానా హైకోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. డేరా బాబా అనుచరుడు రంజిత్ సింగ్ 2002 జూలై 10న హత్యకు గురయ్యారు.
గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు బాలన్న మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. బాలన్న అప్రూవర్గా మారి తమ పేర్లు ఎక్కడ బయట పెడతాడోనని డ్రగ్స్కు బానిసైన బాలన్న కొడుకును పావుగా వాడుకుని మర్డర్ చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.