తిరుమల శ్రీవారి సేవలో మంత్రి సీతక్క | Minister Seethakka Visits Tirumala Temple | RTV
సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వారిని మన్నించాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన తన ఎక్స్లో పోస్ట్ చేశారు.
కేరళలో కొండ చరియలు విరిగిపడిన వయనాడ్ కు వెళ్తున్న క్రమంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మంత్రికి స్వల్పగాయాలు అయ్యాయి.
ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాట్లాడిన ఆయన దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి, మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి పన్ను ఆదా ప్రకటించిందని తెలిపారు.
కెసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంతో 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవట్లేదని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది.
బియ్యం, కందిపప్పు ధరల స్థిరీకరణ మీద ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. వీటి తాలూకా రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు అమ్మకాలు జరపాలని నిర్ణయించారు.
నాణ్యమైన రోడ్లపైనే టోల్ వసూలు చేయాలని, నాణ్యత లేని రోడ్లపై టోల్ వసూలు చేయవద్దని టోల్ గేట్ ఏజెన్సీలకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు చేయటం నేరమని ఆయన పేర్కొన్నారు.వార్త వివరణను ఈ పోస్ట్లో చూడవచ్చు.