TS News: ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్డు సంచలన తీర్పు!
ఓ మహిళ హత్య కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. 2016 ఏప్రిల్ 25న జహీరాబాద్ మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఈ సంచలన తీర్పునిచ్చింది.