రాష్ట్రపతిని కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు.... ఆ అంశంపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి...!
Opposition leaders meet President Droupadi Murmu seek her intervention to restore peace in manipur/రాష్ట్రతిని కలిసిన ‘ఇండియా’ కూటమి సభ్యులు
Opposition leaders meet President Droupadi Murmu seek her intervention to restore peace in manipur/రాష్ట్రతిని కలిసిన ‘ఇండియా’ కూటమి సభ్యులు
Lok Sabha Adjourned Till 2 PM Amid Sloganeering By Oppn MPs / లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..!
మణిపూర్ వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ సంఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగినప్పుడు, మే 18న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.
మణిపూర్ సమస్యపై చర్చించకుండా ఎందుకు పారిపోతున్నారని ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. బెంగాల్ హింసను పక్కదారిపట్టించేందుకే ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం పార్లమెంటులో మణిపూర్పై జరిగే చర్చలో పాల్గొని తమ అనుభవాలను కూడా పంచుకోవాలని కోరుతున్నాను అని అన్నారు. మహిళలు హింసను ఎదుర్కొన్న బెంగాల్ ను కూడా ప్రతిపక్ష ఎంపీలు సందర్శించాల్సిందని దుయ్యబట్టారు. ఇండియా కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన 20 మందినేతలు జూలై 29న మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను అంచనా వేసింది.
కేంద్ర కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో గ్రామ దేవత గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. అధినాయకత్వానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు
ఈశాన్యరాష్ట్రాల్లో మణిపూర్...రత్నాల భూమి, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. అలాంటి మణిపూర్ లో హింసా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈఏడాది మే 3న మొదలైన తెగల మధ్య ఘర్షణ వందల మందిని బలికొన్నది. మణిపూర్ లో ఘర్షణ ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఈ మతకల్లోలాల మంటల్లో మణిపూర్ చిక్కుకుంది. 1993లో కుకీ,నాగా కమ్యూనిటీల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 750 మందికి పైగానే మరణించారు. ఈ సంఖ్య అధికారికంగా వెల్లడించింది మాత్రమే. ఈ అల్లర్లలో గ్రామాలకు గ్రామాలకే నాశనమయ్యాయి. 1993లో ఏం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు.
మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడానికి తిరస్కరించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల దృష్ట్యా పదవి నుంచి దిగిపోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కానీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.కేంద్ర నాయకత్వం ఆదేశించినప్పుడే ఈ చర్య తీసుకుంటానని మణిపూర్ ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాజీనామా చేయాలని తనను పార్టీ కోరలేదన్నారు.రాష్ట్రంలో అశాంతికి అక్రమంగా వస్తున్న శరణార్థులు,మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న స్మగ్లర్లే కారణమని ఆయన అన్నారు.గత మూడు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
మణిపూర్ లో దుండగలు మరోసారి రెచ్చిపోయారు. మణిపూర్ లో చెలరేగిన మంటలు ఇప్పుడప్పుడే ఆరే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మోరే జిల్లాలో దుండగులు ఎన్నో ఇళ్లకు నిప్పు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కొన్ని బస్సులను కూడా తగలబెట్టినట్లు సమాచారం. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.