మణిపూర్ వైరల్ వీడియో కేసులో సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. వీడియో బయటికి వచ్చిన తర్వాత మహిళలను నగ్నంగా ఊరేగించిన విషయం వెలుగులోకి వచ్చిందని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే ఇది మహిళలపై దాడులు లేదా వేధింపులకు గురైన సంఘటన మాత్రమే కాదన్నారు. గత మూడు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ, మహిళలపై దారుణాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్ పోలీసుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు గుప్పించారు. ఈ అంశంపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి విచారణ జరగనుంది. మహిళలపై హింసకు సంబంధించిన విస్తృత అంశాన్ని పరిశీలించేందుకు ఒక యంత్రాంగాన్ని కూడా రూపొందించాలని సీజేఐ సూచించారు. ఈ వ్యవస్థ అటువంటి కేసులన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. మణిపూర్లో హింస ప్రారంభమైన మే 3 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మణిపూర్ లో జరిగిన ఘటన ఎంతో భయంకరమైనదని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..ఇంత నిర్లక్ష్యమా? మణిపూర్ ఘటనలో పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం…!!
మణిపూర్ వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ సంఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగినప్పుడు, మే 18న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.
Translate this News: