ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో జరుగుతున్న హింసకు కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శనివారం రాష్ట్ర శాసన మండలిలో గిరిజన సంక్షేమం, గిరిజనులకు అటవీ భూమిని పోడు సాగు కోసం పంపిణీ చేయడంపై జరిగిన లఘు చర్చపై కవిత మాట్లాడారు. మణిపూర్లో జరిగిన హింసాకాండ ప్రభుత్వ ప్రాయోజితమని, అందులో బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. రాష్ట్రంలోని కుకిస్, మెయిటీస్ రెండు జాతుల మధ్య చీలికను సృష్టించిందని ఫైర్ అయ్యారు. మణిపూర్లోని రెండు వర్గాలను ఒకరితో ఒకరు పోటీకి దించి రాష్ట్రాన్ని వార్ జోన్గా బీజేపీ మార్చి చోద్యం చూస్తుందంటూ విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రాయోజిత హింస…దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి,” అని కవిత అన్నారు. మణిపూర్లో పరిస్థితిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ అల్లర్లపై కవిత స్ట్రాంగ్ రియాక్షన్.. మీరే బాధ్యులంటూ విమర్శలు..!!
మణిపూర్ హింసకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మణిపూర్ ఘటనలను ప్రభుత్వ ప్రాయోజిత హింసగా పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ...ఓట్లకోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. శనివారం శాసనమండలిలో రాష్ట్రంలో గిరిజన సంక్షేమం-పోడుపట్టాల పంపిణీ అంశంపై కవిత మాట్లాడారు.
Translate this News: