ఇండియా కూటమి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందంటూ ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. బెంగాల్ ఘటనలను కప్పిపుచ్చుకునేందుకే ఇండియా కూటమి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ముందుగా పార్లమెంట్లో చర్చల్లో పాల్గొనాలంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నెలల తరబడి దిగ్బంధనాలను ఎలా ఎదుర్కొన్నారనే ఆరోపణలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలన్నారు. మణిపూర్ సమస్యపై చర్చించకుండా ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..ఇలాంటి వాళ్లతో కష్టమే..ప్రతిపక్ష ఎంపీలకు చురకలంటించిన కేంద్రమంత్రి…!!
మణిపూర్ సమస్యపై చర్చించకుండా ఎందుకు పారిపోతున్నారని ఇండియా కూటమిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. బెంగాల్ హింసను పక్కదారిపట్టించేందుకే ప్రతిపక్ష ఎంపీల మణిపూర్ అంటూ ఎద్దేవా చేశారు. సోమవారం పార్లమెంటులో మణిపూర్పై జరిగే చర్చలో పాల్గొని తమ అనుభవాలను కూడా పంచుకోవాలని కోరుతున్నాను అని అన్నారు. మహిళలు హింసను ఎదుర్కొన్న బెంగాల్ ను కూడా ప్రతిపక్ష ఎంపీలు సందర్శించాల్సిందని దుయ్యబట్టారు. ఇండియా కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన 20 మందినేతలు జూలై 29న మణిపూర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులను అంచనా వేసింది.
Translate this News: