Karnataka: అంబేడ్కర్ పూజకు రాలేదని విద్యార్థిపై దారుణం.. బట్టలిప్పి ఊరేగించిన స్నేహితులు
కర్ణాటకలో ఓ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అంబేడ్కర్ పూజకు రాలేదని తోటి విద్యార్థిని అర్ధ నగ్నంగా ఊరేగించారు. పలు సెక్షన్ల కింద 20 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.