AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..!
కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.