ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఏ ఫార్మాట్లో ఆడిస్తారో తెలుసా?
వరల్డ్ కప్ లో వరుస ఓటములతో పాటు క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక బోర్డుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ సంచనల ప్రకటన చేసింది.
వచ్చేశారు మనవాళ్ళు మళ్ళీ నంబర్ వన్ స్థానంలోకి పైకి వచ్చేశారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్మన్గిల్, మహ్మద్ సిరాజ్ లు నంబర్ వన్ స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళల్లో రోహిత్ శర్మ సత్తా చాటాడు. ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రోహిత్ రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు దాయాది పాక్ టీమ్ భారత్ చేరుకుంది. ఇటీవల పాక్ ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో పాక్ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో చర్చలు జరపడంతో బీసీసీఐ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్కప్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ప్రపంచకప్పై అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం ఉండటంతో టిక్కెట్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కొంతమందికి మాత్రమే టికెట్లు దక్కాయి. దీంతో ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్లో క్రికెట్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది.
అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ -కీపర్ మహేంద్రసింగ్ ధోని. 2020లో ఇదే రోజున ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007లో ఐసీసీ పురుషుల టి20 ప్రపంచకప్, 2011లో ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్కు స్వస్తి పలికాడు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్లకు కెప్టెన్గా మహీ వ్యవహరించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా తన ఇన్స్టా పేజీలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.