తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఎల్లుండి నుంచే ఒంటిపూట బడులు!
తెలంగాణ విద్యా శాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 15నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూల్స్ పనిచేయనున్నాయి.