Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు మరికాసేపట్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో కొత్త గవర్నమెంటు ఏర్పడ్డాక గవర్నర్ మాట్లాడ్డం ఇదే మొదటిసారి. దీంతో ఆమె ఏం మాట్లాడతారన్న దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు.