ఓవైపు రాజ్భవన్ ముట్టడికి టీఎస్ఆర్టీసీ నేతలు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో రాజ్భవన్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఆర్టీసీ యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. కాసేపట్లో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మీటింగ్ పెట్టనున్నారు. మరోవైపు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆర్టీసీ కార్మికులు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళిసై నుంచి కార్మికులకు పిలుపు వచ్చింది.
పూర్తిగా చదవండి..బిగ్ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు
కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు
Translate this News: