లాస్ట్ ఓవర్ వచ్చేసింది.. ప్రభుత్వం తన ఆట షురూ చేసింది.. సిక్సులు, ఫోర్లు కొట్టేందుకు రెడీ అయ్యింది.. ఇంతలోనే అంపైర్(గవర్నర్) నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు.. లైట్ ఫెయిల్ అయిందని.. ఇలా చికటిలో ఆడడం కరెక్ట్ కాదని.. ఫ్లడ్ లైట్స్ వేసే వరకు గేమ్ ఆపాలని ఝలక్! సీన్ అర్థమైంది కదా..! ఆర్థికపరమైన ఏ బిల్లు అయినా గవర్నర్ ఆమోదం తప్పనిసరి. టీఎస్ఆర్టీసీ(TSRTC)ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై(Tamilisai) సంతకం మస్ట్! ఈ నెల 2నే ఈ బిల్లును రాజ్భవన్(Raj Bhavan)కి పంపింది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల సమయంలో బిల్లును పాస్ చేయాలని ప్రభుత్వం భావించింది. మూడు రోజుల సమావేశాల కాస్త నాలుగో రోజుకు మారాయి కానీ ఇప్పటివరకు బిల్లు అటు, ఇటు, ఎటు కదలలేదు. బిల్లుపై తనకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకునే పనిలో పడ్డారు తమిళిసై. గవర్నర్ సందేహలకు ప్రభుత్వం ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నట్టే కనిపిస్తుంది.. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది..? ఇవాళైనా బిల్లుపై ఓ క్లారిటీ వస్తుందా?
పూర్తిగా చదవండి..ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..!
టీఎస్ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎటూ తేల్చలేదు. ఇవాళే (ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సెషన్ ముగిసేలోపు బిల్లుపై క్లారిటీ వస్తుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. ఒకవేళ గవర్నర్ నుంచి ఇవాళ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే సమావేశాలు రేపటి వరకు పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
Translate this News: